English | Telugu

నాకు మళ్ళీ మాటొచ్చిందోచ్!?

నటి శ్రీవాణి గురించి స్పెషల్ గా ఏమీ చెప్పక్కర్లేదు. బుల్లి తెర ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు. సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ ఐన శ్రీవాణి యూట్యూబ్ పెట్టి అందులో కూడా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. నెల క్రితం శ్రీవాణి తాను ఇక మాట్లాడలేనంటూ డాక్టర్స్ చెప్పారని ఒక బాడ్ న్యూస్ చెప్పింది. రెస్ట్ తీసుకుని ఫుల్ గా హెల్తీగా అయ్యాక ఇప్పుడు మళ్ళీ మాట్లాడింది శ్రీవాణి.

ఐతే ఇటీవల ఆగష్టు 19 న మళ్ళీ డాక్టర్స్ దగ్గరకి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే ఇక ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారని చెప్పింది శ్రీవాణి. థ్రోట్ ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయిందని మాములుగా మాట్లాడొచ్చని చెప్పారు.ఇక ఆ గుడ్ న్యూస్ ని శ్రీవాణి "మేడం అంతే" యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఫాన్స్ కి చెప్పారు. మళ్లీ తిరిగి మాట్లాడగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. “ ఇప్పుడు అంతా సెట్ అయ్యిందని డాక్టర్స్ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మాట్లాడలేకపోయినా సరే మీరు పెట్టే మెసేజ్‌లు చదువుతూ ఉన్నాను. నాకోసం. నా ఆరోగ్యం కోసం దేవుడికి ప్రార్దించిన అందరికీ థాంక్స్.

2002 నుంచి ఇప్పటివరకు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఇంత మంది ఫాన్స్ నాకు ఉన్నారని ఇప్పటిదాకా తెలియదు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అంటూ శ్రీవాణి భావోద్వేగానికి లోనయ్యారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.